‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు

‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు

టాలీవుడ్ హీరో నందమూరీ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక జనవరి 6న సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్ లో జరగాల్సిన ఈ వేడుక.. కొన్ని కారణాల వల్ల వేదికను మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒంగోలులో అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో ఈ ఈవెంట్ జరగనుందని తెలిపారు. ప్లేస్ మారింది కానీ.. మాస్ జాతర కాదు అంటూ మేకర్స్ ట్విట్లర్ ద్వారా పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్ ‌‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో మూవీ సాగనున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.