కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలం

కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలం

హైదరాబాద్: పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను వేలం వేసేందుకు రంగం సిద్దం చేశారు సిటీ పోలీసులు. అన్ క్లెయిమ్డ్ వెహికిల్స్ తోపాటు చాలా రోజులుగా పోలీస్ స్టేషన్లలో ఉన్న వాహనాలు వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో 1,279 వరకు వెహికిల్స్ ఉన్నాయి. వీటిని తీసుకోవడాని ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలం వేయాలని నిర్ణయించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. వేలం వేయాలనుకుంటున్న వాహనాలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలున్నా, యజమానులెవరైనా తగిన పత్రాలతో బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 15రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.