వాహనాలు రోడ్లపై రోజుల తరబడి పార్కింగ్ చేస్తున్నారా?..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే

వాహనాలు రోడ్లపై రోజుల తరబడి పార్కింగ్ చేస్తున్నారా?..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే

వాహనాలు ఎక్కడిపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారా? రోజుల తరబడి ఒకేచోట ఉంచుతున్నారా? వాహనాల పార్కింగ్ పై ఇప్పుడు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.ఎనిమిది రోజులకంటే ఎక్కువ సమయం వాహనాలు ఒకేచోట పార్కింగ్ చేస్తే సీజ్ అయినట్లే..అంతేకాదు స్క్రాప్లో పడేస్తారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలుచేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తం చేసినా ఆశ్చర్యం పోనవసరంలేదు. 

గోవా ప్రభుత్వం వాహనాల పార్కింగ్పై కొత్త రూల్స్ పెట్టింది. రోడ్లపై, ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది.ఎనిమిది రోజుల కంటే ఎక్కువ కాలం వాహనాలను ఒకేచోట పార్కింగ్ చేస్తే వాటిని సీజ్ చేసి స్క్రాప్లో పడేస్తుంది. ముందుగా వాహనాల యజమానులకు నోటీసులిస్తుంది..నోటీసులకు వారు స్పందించకపోతే సీజ్, స్క్రాప్ కు పంపుతోంది.  

ఇప్పటివరకు గోవాలో దాదాపు 250కి పైగా వాహనాలను సీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు పక్కన గ్యారేజీలు, అక్రమ అద్దె వాహనాలపై కూడా ఈ చర్యలు అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు. 

దెబ్బతిన్న వాహనాలు, వినియోగంలో లేని వాహనాలను రోడ్లపై వదిలేసి, ట్రాఫిక్‌ను మరింత స్తంభింపజేసే రోడ్డు పక్కన ఉన్న గ్యారేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గోవా సీఎం సావంత్. రాష్ట్రంలో అక్రమ అద్దె వాహనాల సంఖ్య పెరుగుతోందని సీఎం సావంత్ ఆందోళన వ్యక్తం చేశారు.  అవసరమైన అనుమతులు లేకుండా అద్దెకు నడుపుతున్న 550 ప్రైవేట్ వాహనాల లైసెన్స్ రద్దుకు చర్యలు చేపట్టామన్నారు. 

ఈ సమస్య తీవ్రతను ఎత్తిచూపుతూ గోవాలో ఏటా 365 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో 70శాతం కంటే ఎటువంటి తప్పులు చేయని వారే చనిపోతున్నారని సావంత్ తెలిపారు.ఈ ప్రమాదాల్లో అద్దె కార్లు ,బైకుల వల్లే జరుగుతున్నాయని చెప్పారు సీఎం సావంత్ .