దమ్ముంటే రా తేల్చుకుందాం.. సవాల్ విసిరిన వేముల..

దమ్ముంటే రా తేల్చుకుందాం.. సవాల్ విసిరిన వేముల..

 మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డి చేసే ఆరోపణలు పనికిరానివని అన్నారు. "ఎవరు 420 అనేది ప్రజలకు తెలుసు.. మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాం.. నేను రాజీనామాకు సిద్ధం నువ్వు సిద్ధమా.. దమ్మంటే రా" అని వేముల వీరేశం సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో వేముల మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులతో నకిరేకల్ నియోజకవర్గంలో కొత్తగా ఒక ఎకరానికి కూడా నీళ్లు అందించలేదని విమర్శించారు. నక్కల గండి,  బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే జగదీష్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వేముల అన్నారు.