కేటీఆర్ మీటింగ్ ​ముగిసిన కాసేపటికే.. వేములవాడలో బీఆర్ఎస్​కు​ షాక్

కేటీఆర్ మీటింగ్ ​ముగిసిన కాసేపటికే.. వేములవాడలో బీఆర్ఎస్​కు​ షాక్
  • కేటీఆర్ మీటింగ్ ​ముగిసిన కాసేపటికే..వేములవాడలో బీఆర్ఎస్​కు​ షాక్
  • పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్, కో ఆప్షన్ ​సభ్యురాలి రాజీనామా

వేములవాడ, వెలుగు :  వేములవాడలో మంత్రి కేటీఆర్​ సోమవారం నిర్వహించిన యువ సమ్మేళనం ముగిసిన కాసేపటికే  ఆ పార్టీకి స్థానిక నేతలు షాక్​ ఇచ్చారు. మంత్రి వెళ్లిన కొద్దిసేపట్లోనే వేములవాడ బీఆర్ఎస్​ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, మున్సిపల్​ కో అప్షన్​ మెంబర్​ పుల్కం లక్ష్మి, 14 వార్డు కౌన్సిలర్​ బింగి మహేశ్​తో పాటు వట్టెంల రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు చెక్కిళ్ల పర్శరాములు బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. 

వేములవాడ కాంగ్రెస్​అభ్యర్థి ఆది శ్రీనివాస్​ సమ క్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన వారు మాట్లాడుతూ బీఆర్​ఎస్​ వైఖరి, పార్టీలో కొంత మంది నాయకుల తీరు నచ్చకనే రిజైన్ ​చేశామన్నారు. అలాగే తాము ఆశించిన అభివృద్ధి వేములవాడలో జరగలేదన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ​ప్రజల్లో ఉన్నాడని, బీసీ నాయకుడికి అండగా ఉండాలనే కాంగ్రెస్​ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్​ పాల్గొన్నారు.