బీఆర్ఎస్‌‌, బీజేపీలు ఒక్కటే : అది శ్రీనివాస్

బీఆర్ఎస్‌‌, బీజేపీలు ఒక్కటే : అది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు:  బీఆర్ఎస్​, బీజేపీలు ఒక్కటేనని, ఆ పార్టీలో గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని వేములవాడ కాంగ్రెస్​ అభ్యర్థి అది శ్రీనివాస్​ అన్నారు.  శనివారం వేములవాడలోని హరిమల ఫంక్షన్ హాల్లో ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనంలో ఉండే నాయకుడు కావాలో, సిటీలో ఉంటూ గెస్ట్​లా వచ్చే నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. 

నాలుగు సార్లు ఓడినా ప్రజల మధ్యలోనే ఉన్నానని, ప్రస్తుత బీఆర్ఎస్​అభ్యర్థి ఏనాడూ ప్రజలకు కనిపించలేదన్నారు. మైనార్టీ, బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్​మాత్రమే ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వెంకటేశ్​, కొమరయ్య, మైనార్టీ లీడర్లు రజాక్, సాబీర్, యూసుఫ్, అన్వర్, చాంద్ ఫెరోజ్, రెహమాన్, రిజ్వాన్ పాల్గొన్నారు.