నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

వేములవాడ/వేముల వాడ రూరల్, వెలుగు : మిడ్​మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగ ఫలితంగానే  రైతులకు  నీరందుతోందని, ఆలస్యమైనా నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు అన్నారు.  ఆదివారం వేములవాడ అర్బన్​ మండలం చీర్లవంచలో 36 మంది మిడ్​మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఎమ్మెల్యే రూ. 4 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నిర్వాసిత యువత కోసం ప్రత్యేకంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

దళితుల అభివృద్ధికి కృషి

ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే రమేశ్​బాబు అన్నారు. వేములవాడ రూరల్​ మండలం పోచెట్టిపల్లి గ్రామంలో సువర్ణ టెంట్ హౌస్  యూనిట్ ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబాలలో పేదరికాన్ని  తొలగించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునివ్వడమే దళితబంధు ఉద్ధేశ్యమన్నారు.