
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలోని 200 కోడెలను సోమవారం సాయంత్రం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడెల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు. రైతులు కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈవో వినోద్, డీఏవో అఫ్జల్ బేగం, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.