
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా దేశభక్తి జానర్ లో రాబోతోంది.
ప్రముఖ రచయిత,- ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఫేమ్) రైటర్.. ఈ దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాని -భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రసాద్ లాబ్స్లో ప్రత్యేకంగా వీక్షించారు.
ఈ సినిమా గురించి మాట్లాడిన వెంకయ్య నాయుడు ‘దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి.. ఇలాంటి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు.. యువతకు ఈ సినిమా ద్వారా చక్కటి సందేశం అందిస్తున్నారు. సినిమా చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి దేశభక్తి సినిమాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.