
టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది. వెంకటేశ్ బాబాయ్, దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 4న బాపట్ల జిల్లా కారంచేడులోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు.
ఈ విషయం తెలిసిన దగ్గుపాటి సురేష్ బాబు కుటుంబ సభ్యులు కారంచేడుకు వెళ్లి నివాళి అర్పించారు. వెంకటేశ్ ,రానా ఏప్రిల్ 5న కారంచేడుకి వెళ్లి మోహన్ బాబు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. దగ్గుపాటి మోహన్ బాబు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్ బాబుకు సంతాపం తెలిపారు.