
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానాలు కలిసి మొదటి సారిగా ఓ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న "రానా నాయుడు" వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన రానా, వెంకటేష్ పోస్టర్లు, టీజర్ భారీగా అంచనాలు పెంచాయి. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించి త్వరలోనే ట్రైలర్ లాంచ్ కానుందని వెంకీ హింట్ ఇచ్చాడు. రానాకు వార్నింగ్ ఇస్తున్న ఓ వీడియోను వెంకీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. వీడియో వీడియో ఖేల్నా బంద్ కర్.. తూనే షో కా నామ్ బద్ లా.. ట్రైలర్ లాంచ్ హోనేదే తేరీ షకల్ బదల్ దూంగా మే.. అంటూ హిందీలో వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వీడియో సిరీస్ ప్రమోషన్ కోసమే అనే విషయం స్పష్టమౌతుంది.
ఇక వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ వెర్షన్ గా "రానా నాయుడు"గా తెరకెక్కించారు. మన నెటీవీటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్లో ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించారు. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేశారు. నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో..త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.