
–హైదరాబాద్, వెలుగు: గ్రూప్- 4 మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. హైదరాబాద్లో రెండు సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ రాష్ట్ర కార్యాలయంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకాని, సర్టిఫికెట్లు సమర్పించని అభ్యర్థుల కోసం ఆగస్టు 24, 27, 28, 29, 30 31వ తేదీల్లో మరో అవకాశం కల్పించినట్టు తెలిపింది. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ రోజువారి షెడ్యూల్ను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొంది.