న్యూఢిల్లీ : రైతులు పండించిన పండ్లు, కూరగాయలకు కరోనా కారణంగా మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. కృషి ఉడాన్ పథకంలో భాగంగా ఫారెన్ కంట్రీలకు వీటిని ఎక్స్ ఫోర్ట్ చేస్తోంది. ఇందుకోసం ఎయిర్ ఇండియా రెండు ఫ్లైట్లను నడుపుతోంది. సీజనల్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ను లండన్, జర్మనీలో ని ఫ్రాంక్ ఫర్ట్ కు ఎగుమతి చేస్తోంది. సోమవారం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి ప్రూట్స్, వెజిటెబుల్స్ తో లండన్ లో దిగనుంది. మరో ఫ్లైట్ ను ఈ నెల 15 న ఫ్రాంక్ ఫర్ట్ కు పంపించనున్నారు. విదేశాలకు వీటిని ఎగుమతి చేయటం ద్వారా రైతులకు మంచి ఆదాయం రానుంది. కృషి ఉడాన్ పథకాన్ని రైతులు విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కేంద్రం గతంలోనే ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం రైతులు పండించిన పండ్లను పెద్దగా గిరాకీ లేదు. ఇదే సమయంలో ఫారెన్ కంట్రీస్ లో వీటి అవసరం ఉండటంతో అక్కడికి ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు. తిరిగి వచ్చేప్పుడు ఇవే ఫ్లైట్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ ఎక్విప్ మెంట్ ను తీసుకొస్తారు. ” విదేశాలకు పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయటం ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఎగుమతులు, దిగుమతులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి ” అని ఓ అధికారి తెలిపారు. కరోనా ఎఫెక్ట్ మొదలైన నాటి నుంచి ఎయిర్ ఇండియా దాదాపు 119 ఫ్లైట్లను వివిధ దేశాలకు నడుపుతోంది. అక్కడ ఉన్న మన వాళ్లను తీసుకురావటంతో పాటు మెడిసిన్స్, ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ను ఎక్స్ పోర్ట్ చేస్తోంది.
మన పండ్లు, కూరగాయలు ఫారెన్ కు ఎక్స్ పోర్ట్
- దేశం
- April 12, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ