గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి...సీఎస్కు వీహెచ్పీ వినతి

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి...సీఎస్కు వీహెచ్పీ వినతి
బషీర్​బాగ్, వెలుగు:​ తెలంగాణలో గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్​పీ) ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు పగుడాకుల బాలస్వామి, రమేశ్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా, వధ ఘటనలు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్​ను నియమించాలని డిమాండ్ చేశారు. 

హైవేలు, చెక్​పోస్టుల వద్ద తనిఖీలు పెంచాలని, అక్రమ వధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్వామీజీలు దుర్గానంద, సర్వేశ్వర శివయోగి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.