ఖైరతాబాద్, వెలుగు: హైకోర్టు ఆదేశాలున్నా తమ భవనాలు కూల్చివేశారని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మండలం కృష్ణారెడ్డి పేట బాధితులు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. 164 సర్వే నంబర్లో తమ భవనాలు ఉన్నాయని, అక్కడి తహసీల్దార్హైడ్రా అధికారుల ద్వారా వాటిని కూల్చివేయించారని చెప్పారు. రెండో తేదీతో ఉన్న నోటీసును14న గోడకు అంటించి వెళ్లిపోయారని, 22న వచ్చి కనీసం సమయం ఇవ్వకుండా కూల్పివేశారన్నారు. దీనివల్ల తమకు రూ. కోట్ల నష్టం జరిగిందని వాపోయారు. కోర్టుకు వెళ్లినందుకే తహసీల్దార్ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
