
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిచారు. ఇది బలవంతులపై బలహీనులు సాధించిన విజయంగా ఆయన అభివర్ణి్ంచారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
తాము నిజాయతీతో, ప్రేమతో పోరాటం చేశామని దాన్ని ప్రజలు స్వీకరించి ఇంత పెద్ద విజయం అందించారని పేర్కొన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడిందని అన్నారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.
తొలి క్యాబినెట్లోనే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రేమతో కన్నడ ప్రజల మనసులు గెలుచుకున్నాం అని అన్నారు. రాహుల్ పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.