విక్టరీ వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను డైరక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ సైంధవ్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలి షాట్కు క్లాప్ ఇవ్వగా, నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనిల్ రావిపూడి ముహూర్తపు షాట్ డైరెక్ట్ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో నాని, నాగచైతన్య, రానా తదితరులు పాల్గొన్నారు.
హీరో వెంకటేశ్కు ఇది 75 వ చిత్రం కావడం విశేషం. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.