రంజీ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టిన విదర్భ

రంజీ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టిన విదర్భ

నాగ్‌‌‌‌పూర్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో చెలరేగిన విదర్భ.. రంజీ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బౌలింగ్‌‌‌‌లో యష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (3/60), ఆకాశ్‌‌‌‌ వాకరే (3/42) రాణించడంతో.. బుధవారం ముగిసిన సెమీస్‌‌‌‌లో విదర్భ 62 రన్స్‌‌‌‌ తేడాతో మధ్యప్రదేశ్‌‌‌‌పై గెలిచింది. 321 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఛేదనలో 228/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్‌‌‌‌ రెండో ఇన్నిం గ్స్‌‌‌‌లో 81.3 ఓవర్లలో 258 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. 

విదర్భ బౌలర్ల దాడికి ఎంపీ 30 రన్స్‌‌‌‌ తేడా లో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. సారాన్షు జైన్‌‌‌‌ (25) పోరాడే ప్రయత్నం చేసినా.. రెండో ఎండ్‌‌‌‌లో ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (8 నాటౌట్‌‌‌‌) మినహా, కుమార్‌‌‌‌ కార్తికేయ (0), అనుభవ్‌‌‌‌ అగ ర్వాల్‌‌‌‌ (0), కుల్వంత్‌‌‌‌ (11) వరుస విరామాల్లో ఔట్‌‌‌‌ కావడంతో ఓటమి తప్పలేదు. ఆదిత్య సర్వాటే, ఆదిత్య థాకరే చెరో రెండు వికెట్లు తీశారు. యష్‌‌‌‌ రాథోడ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ లభించింది. ఆదివారం నుంచి జరిగే ఫైనల్లో విదర్భ, ముంబై తలపడతాయి.