సైబర్​ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

సైబర్​ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

హనుమకొండ, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ స్టేషన్ లో, 1930 టోల్ ఫ్రీ నెంబర్​కు కాల్​ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. మంగళవారం వరంగల్ కమిషనరేట్​లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఓటీపీలు, లింక్​లు, ఇతర ఆన్ లైన్ మోసాలకు గురైన బాధితులు కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ స్టేషన్​లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. 

అనంతరం పోలీస్‌‌సిబ్బందికి సీపీ సెల్‌‌ఫోన్‌‌, సిమ్‌‌కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు రవీందర్‌‌, అబ్దుల్‌‌బారీ, ట్రైనీ ఐపీఎస్‌‌అధికారులు అంకిత్‌‌, శుభంనాగ్‌‌, అడిషనల్ డీసీపీలు రవి, సంజీవ్‌‌, సురేశ్ కుమార్‌‌, సైబర్‌‌క్రైమ్స్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ ఏసీపీ విజయ్‌‌కుమార్‌‌, సీఐ రవి కుమార్‌‌ పాల్గొన్నారు.