టైమ్స్ జాబితాలో విజయ్ దేవరకొండకు రెండో స్థానం

టైమ్స్ జాబితాలో విజయ్ దేవరకొండకు రెండో స్థానం
  • బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్..
  • అంతర్జాతీయ క్రికెటర్లకు దీటుగా ఫాలోయింగ్

ఆల్ ఇండియా "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సెకండ్ ప్లేస్  కొట్టేశాడు. బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రీసెంట్ గా హైదరాబాద్ "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా..ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లో జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్నాడు. గత సంవత్సరం మూడో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో మెట్టు పైకెక్కి రెండో స్థానానికి ఎగబాకాడు. రణవీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.
ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా... రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

"అర్జున్ రెడ్డి" సినిమా హిందీ రీమేక్ "కబీర్ సింగ్" తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా "లైగర్" తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు. "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లిస్ట్ లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది. దీంతో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా "లైగర్" మీద భారీ అంచనాలు  ఏర్పడ్డాయి.