
ఆహా’ ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3కి చీఫ్ గెస్ట్గా హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి రావడం ఆనందంగా ఉందని, తెలుగు కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేసేందుకు వచ్చానని విజయ్ ఈ సందర్భంగా చెప్పాడు.
ఈ షోకు సంగీత దర్శకుడు తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి జడ్జిలుగా వ్యవహరిస్తుండగా, శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేస్తున్నాడు. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఈ రియాల్టీ షో ప్రసారం అవుతుంది.