మాట మీద నిలబడ్డ విజయ్ దేవరకొండ

మాట మీద నిలబడ్డ విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన సొంత ఖర్చులతో 100మంది లక్కీ ఫ్యాన్స్ కు ఫ్రీగా మనాలీ ట్రిప్ ఏర్పాటు చేశారు. ఐదేళ్ల కిందట దేవర శాంటా పేరుతో ఓ సరికొత్త ట్రెండ్ కి తెరలేపిన విజయ్ దేవరకొండ.. గతేడాది ఐదో వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా 100మందిని తన సొంత ఖర్చుతో హాలిడే ట్రిప్ కు పంపబోతున్నానని, డెస్టినేషన్ సెలక్ట్ చేయండంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోల్ కూడా పెట్టారు. చాలా మంది మౌంటెన్స్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ కు ఓటెయ్యడంతో అక్కడికే వారిని పంపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఫుడ్, ట్రావెలింగ్, ఫెసిలిటీతో సహా 5 రోజుల పాటు అన్ని ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. తాజాగా ఈ 100మంది ఫ్యాన్స్ ఫ్లైట్ లో వెళుతున్న ఓ వీడియోను విజయ్ షేర్ చేస్తూ.. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందని, చాలా ఆనందంగా అనిపిస్తోందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులపై ఉన్న ప్రేమను విజయ్ మరోసారి చాటుకున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఈ రౌడీ హీరోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.