విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌‌‌ను విజయంతో ముగించిన హైదరాబాద్

విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌‌‌ను విజయంతో ముగించిన హైదరాబాద్

జైపూర్: కెప్టెన్ రాహుల్ సింగ్ (56 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 నాటౌట్‌‌‌‌) మెరుపు సెంచరీకి తోడు కార్తికేయ (5/36) ఐదు వికెట్లతో చెలరేగడంతో  విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌ విజయంతో ముగించింది.  మంగళవారం జరిగిన గ్రూప్–బి చివరి మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తు చేసింది. టాస్ ఓడిన మేఘాలయ తొలుత 41.1 ఓవర్లలో 158 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. తన్మయ్ మిశ్రా (49) టాప్‌‌‌‌ స్కోరర్. రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే 161/1 స్కోరు చేసి గెలిచింది. రాహుల్‌‌‌‌తో పాటు తన్మయ్‌‌‌‌ అగర్వాల్ (49 నాటౌట్‌‌‌‌) రాణించారు. ఏడు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగు నెగ్గి,  మూడింటిలో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూప్‌‌‌‌–బిలో నాలుగో ప్లేస్‌‌‌‌తో నిలిచి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్ చేరలేకపోయింది.