కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్, వెస్టిండీస్ స్టార్ట్ ప్లేయర్ క్రిస్ గేల్ ను మాల్యా కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ లో పోస్టు చేశారు మాల్యా. తన బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ హెన్రీ గేల్, యూనివర్స్ బాస్ ను కలుసుకోవడం చాలా బాగుందని పోస్టులో రాసుకొచ్చారు. బెంగళూరు జట్టుకు అతడిని తీసుకున్నప్పటి నుంచి తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందన్నారు.
గేల్ ను జట్టులోకి తీసుకోవడం ఎప్పటికీ ఉత్తమైన ఎంపికగా ఆయన అభివర్ణించారు. మాల్యా చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. గతంలో మాల్యా బెంగళూరు జట్టుకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. 2011 నుంచి 2017 వరకు క్రిస్ గేల్ బెంగళూరు జట్టుకు ఆడాడు. పుణె జట్టుపై 175 పరుగుల అత్యధిక స్కోరును సాధించాడు. 91 గేమ్ లలో 43.29 సగటుతో 154.40 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. 21 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు సాధించాడు. మొత్తం 3 వేల 420 పరుగులు చేశాడు.
Great to catch up with my good friend Christopher Henry Gayle @henrygayle , the Universe Boss. Super friendship since I recruited him for RCB. Best acquisition of a player ever. pic.twitter.com/X5Ny9d6n6t
— Vijay Mallya (@TheVijayMallya) June 22, 2022