గ్రూప్ - 4 రద్దు చేసి మరోసారి పెట్టండి : విజయ్ నాయక్

గ్రూప్ - 4 రద్దు చేసి మరోసారి  పెట్టండి : విజయ్ నాయక్
  • మంత్రులకు తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం వినతి

ఓయూ, వెలుగు: టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్​-– 4  పరీక్షలను  రద్దు చేసి  మళ్లీ నిర్వహించాలని తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.  గత బీఆర్ఎస్​ పాలనలో జరిగిన గ్రూప్ –-4 ఎగ్జామ్ లో 963 ఓఎంఆర్​ షీట్లు ఎక్కువగా వచ్చాయని, వాటికి బయో మెట్రిక్ విధానం పాటించలేదని గుర్తుచేశారు.  

పాత బోర్డులో నిర్వహించిన  అన్ని పరీక్షల్లో  అవకతవకలు, పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం  గ్రూప్ 4  రిజల్ట్ ఇవ్వకుండా పరీక్షలను  రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. మంత్రులను కలిసిన వారిలో నిరుద్యోగులు అర్జున్, శశి కుమార్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు.