
- మంత్రులకు తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం వినతి
ఓయూ, వెలుగు: టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-– 4 పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన గ్రూప్ –-4 ఎగ్జామ్ లో 963 ఓఎంఆర్ షీట్లు ఎక్కువగా వచ్చాయని, వాటికి బయో మెట్రిక్ విధానం పాటించలేదని గుర్తుచేశారు.
పాత బోర్డులో నిర్వహించిన అన్ని పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వకుండా పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. మంత్రులను కలిసిన వారిలో నిరుద్యోగులు అర్జున్, శశి కుమార్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నారు.