
- విజయ డెయిరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి
సదాశివనగర్, వెలుగు : ప్రతి నెలా కామారెడ్డి జిల్లాకు పాల బిల్లు రూ.కోటి చెల్లిస్తున్నామని విజయ డెయిరీ రాష్ట్ర చైర్మన్ గుత్త అమిత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో విజయ డెయిరీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింత కుంట తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతులు అమిత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాల బిల్లులు ఆలస్యమయ్యేవని, సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారన్నారు.
పశువుల దాణా, గడ్డి జొన్నలను అందిస్తున్నామన్నారు. ఎర్రపహాడ్ బీఎంసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీబీపేట్ అధ్యక్షుడు సత్యంరెడ్డి, భిక్కనూర్ అధ్యక్షుడు లోహిత్ రెడ్డి, దోమకోండ అధ్యక్షుడు నరేశ్ రెడ్డి, బ్రహ్మజివాడి అధ్యక్షుడు రాజేశ్వర్ రావు ఉన్నారు.