
సిటీలో విజయదశమి (దసరా) వేడుకలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు శమి పూజలు నిర్వహించారు. జమ్మి ఆకులను ఇచ్చుకుంటా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం మైదానాల్లో రావణ దహనం నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలివచ్చి వీక్షించారు.