భవిత రహిత సమితికి రాష్ట్రంలో చోటు లేదు : విజయశాంతి

భవిత రహిత సమితికి రాష్ట్రంలో చోటు లేదు : విజయశాంతి

 బీఆర్​ఎస్​పై విజయశాంతి సెటైర్లు

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్​ఎస్​ పార్టీపై కాంగ్రెస్​ నేత విజయశాంతి ఫైరయ్యారు. కేసీఆర్  వస్తున్నారు.. ప్రభంజనం సృష్టించబోతున్నారంటూ సంతోష్​ కుమార్ చేసిన ట్వీట్​పై సెటైర్లు వేస్తూ ఆమె మంగళవారం ట్వీట్​చేశారు. ‘‘అవును మీ నేత తిరిగొచ్చారు. కానీ, కాంగ్రెస్​ పార్టీ మీ పార్టీ కన్నా ఎంతో ముందుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. ప్రజలను ఇన్నాళ్లూ బానిసల్లాగా చూసిన కేసీఆర్​ టీమ్, భవిత రహిత సమితి పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఇంక చోటు లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.