బీఆర్ఎస్పై విజయశాంతి సెటైర్లు
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైరయ్యారు. కేసీఆర్ వస్తున్నారు.. ప్రభంజనం సృష్టించబోతున్నారంటూ సంతోష్ కుమార్ చేసిన ట్వీట్పై సెటైర్లు వేస్తూ ఆమె మంగళవారం ట్వీట్చేశారు. ‘‘అవును మీ నేత తిరిగొచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కన్నా ఎంతో ముందుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. ప్రజలను ఇన్నాళ్లూ బానిసల్లాగా చూసిన కేసీఆర్ టీమ్, భవిత రహిత సమితి పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఇంక చోటు లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.