రాజాసింగ్ భద్రతపై కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వండి
రాష్ట్ర ఇంటెలిజెన్స్కు బీజేపీ నేత విజయశాంతి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సమాచారం అనుసరించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రత సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ కేంద్రానికి సరైన నివేదిక ఇస్తుందని తాను భావిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.