నాడు ఇవ్వడానికి లక్ష రూపాయలు లేవు.. ఇప్పుడు లక్షకోట్లు ఎలా సంపాదించారు?

నాడు ఇవ్వడానికి లక్ష రూపాయలు లేవు.. ఇప్పుడు లక్షకోట్లు ఎలా సంపాదించారు?

తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు రాఖీ కట్టేందుకు రూ.లక్షరూపాయలు లేవన్న కేసీఆర్ నేడు రూ.లక్షకోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని బీజేపీ మహిళా నేత విజయశాంతి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ..తాను బీజేపీలో ఉండగా 1998 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పని చేసినట్లు చెప్పారు. నేను బీజేపీలో ఉంటే కేసీఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు. అలయన్స్ లో ఉండగా..తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం పడిపోతుందని ఒత్తిడి తెచ్చారని, చంద్రబాబు కారణంగానే అప్పట్లో బీజేపీని వీడినట్లు గుర్తు చేశారు. బీజేపీని వీడి ఉద్యమం చేస్తుంటే..కొంతకాలానికి టీడీపీలో కేసీఆర్ కు మంత్రి పదవి రాకపోవడంతో అప్పటికే ఉదృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ తనని తాను అందరిలో ప్రొజెక్ట్  చేసుకొని కుట్రలకు పాల్పడినట్లు విజయశాంతి చెప్పారు.

తాను తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి…, ఆ పార్టీ తరుపున తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే… మరోపక్క కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యోగ, విద్యార్ధి ఇలా అన్నీ సంఘాలతో తనకు తప్పా..ఇతర కుటుంబ సభ్యులకు స్థానం లేదని కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించినట్లు విజయశాంతి వెల్లడించారు.

కేసీఆర్ తన చరిష్మా తట్టుకోలేక కుట్రతో  తల్లితెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని టైగర్ నరేంద్రను పంపారని అన్నారు. 25సార్లు టైగర్ నరేంద్ర తనతో తల్లితెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరడంతో… నిస్వార్ధంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని, అందుకే తల్లి తెలంగాణ పార్టీని..,టీఆర్ఎస్ లో విలీన చేసినట్లు విజయశాంతి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఉద్యమం జరుగుతుంది. టీఆర్ఎస్ లో యాక్టీవ్ ఉన్న తనని కుట్ర చేసి…పార్టీలో తానొక్కడినే ఎదగాలనే స్వార్ధంతో కేసీఆర్ తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పిన విజయశాంతి…, కేసీఆర్ కు ఉద్యమం పేరుతో ఉద్యమ కారుల సమాధుల మీద పరిపాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు లక్షరూపాయలు లేని కేసీఆర్ ఈరోజు లక్షకోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు.