వికారాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపి పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిగా బదిలీ అవుతున్న అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్కు శనివారం రెవెన్యూ, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో లింగ్యా నాయక్ ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు.
