ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల ప్రచారానికి వెళితే ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు మాకు ఏం చేశారని ఇప్పడు ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ వారిపై తిరగబడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా గండీడ్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్ రెడ్డి సతీమణిని గ్రామస్తులు అడ్డుకున్నారు. 

గండీడ్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్ రెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మా గ్రామానికి ఎందుకు వచ్చావ్... బీఆర్ఎస్ మా గ్రామాన్ని ఏం అభివృద్ధి  చేసిందని.. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారంటూ నిలదీశారు. దళితబంధు, బీసీ బంధు రాలేదంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి తోపుటాటకు దారి తీసింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.