
ఆఫీసర్లు ఆదేశించారంటున్న పంచాయతీ సెక్రటరీ
నవాబుపేట, వెలుగు: పంచాయతీ సెక్రటరీకి కరోనా సోకినప్పటికీ హోమ్ఐసోలేషన్లో ఉండకుండా ప్రాపర్టీ సర్వే చేస్తున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో మంగళవారం వెలుగుచూసింది. యన్మన్గండ్ల పంచాయతీ సెక్రటరీకి గత నెలలో కరోనా సోకింది. క్వారంటైన్లోకి వెళ్లిన ఆయన 17 రోజుల తర్వాత పరీక్షలు చేయించుకోగా మళ్లీ పాజిటివ్ వచ్చింది. విషయాన్ని అధికారులకు తెలియజేసినా సర్వేకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశించారని సెక్రటరీ పేర్కొంటున్నారు. మంగళవారం గ్రామంలో తిరుగుతూ జనాలతో కలుస్తూ సర్వే నిర్వహించడంతో అంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినప్పటికీ బయట ఎందుకు తిరుగుతున్నావని ప్రజలు ప్రశ్నించగా విషయం చెప్పినప్పటికీ ఉన్నతాధికారులే సర్వే చేయాలని ఆదేశించారని సెక్రటరీ వారికి సమాధానమిచ్చారు.
For More News..