రైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్​ రావు పటేల్​

రైతులపై అప్పులు.. పేదలపై ధరల భారం : మోహన్​ రావు పటేల్​

భైంసా, వెలుగు: ప్రతి రైతుపై అప్పుల భారంతోపాటు పేదలపై ధరల భారం మోపుతున్న ఘనత సీఎం కేసీఆర్​సర్కారుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​ రావు పటేల్​విమర్శించారు. గురువారం భైంసా మండలం కథ్​గాం గ్రామంలో ‘పల్లె పల్లెకు బీజేపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కేంద్ర పథకాలు, బీఆర్ఎస్​సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తగ్గడమే కాకుండా ప్రజలకు గోస తప్పడం లేదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని.. ప్రతి రైతు సంతోషంగా ఉండడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. లీడర్లు రాము, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.​