కరెంటు బిల్లు.. రూ. 5.3 లక్షలు

కరెంటు బిల్లు.. రూ. 5.3 లక్షలు

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని బండపల్లికి చెందిన ముస్త్యాల అంజయ్య ఇంటి కరెంట్​బిల్లు రూ. 5,30,539 రావడంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ నెల 13న అతని ఇంటికి వచ్చిన మీటర్​బాయ్​ ప్రీవియస్​ రీడింగ్​6,386 ఉండగా దాన్ని 64,432గా నమోదు చేయడంతో బిల్లు ఏకంగా రూ.5 లక్షలు దాటింది. హుటాహుటిన లోకల్​కరెంట్​బిల్లు ఆఫీసుకు వెళ్లగా.. పైఆఫీసర్​వద్దకు వెళ్లాలని అక్కడున్నవారు సూచించారు. ఈ విషయంపై ఏఈ మల్లేశ్వర్​ను వివరణ కోరగా.. బిల్లులు కొట్టే సిబ్బంది సమ్మెలో ఉండటంతో కొత్త సిబ్బందిని తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 13న బిల్లు రీడింగ్​కొడుతున్న సమయంలో స్పాట్​ డిజిట్స్ ​పొరపాటు కొట్టడంతో బిల్లు రూ.5 లక్షలు దాటిందని, అతడి ఇంటికి వెళ్లి మళ్లీ సవరించి కొట్టగా.. రూ.162 బిల్లు వచ్చినట్లు తెలిపారు.