ఏం చేశారని మా గ్రామానికి వచ్చారు: గ్రామస్తులు

ఏం చేశారని మా గ్రామానికి వచ్చారు: గ్రామస్తులు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డాక్యతండా, రాజ్య తాండలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే డాక్య తండాలో పద్మాదేవేందర్ రెడ్డిని గ్రామంలో మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామా న్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినా.. గ్రామ అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. 

Also Read :- ఇది బాగోలేదు నాకు అగ్గిపెట్టె గుర్తు కావాలి

గ్రామంలో మురుగు నీరు ఉందని, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలకు బిల్లులు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.