
- అంతకుముందు గ్రామస్తులపై దాడి
- ముగ్గురికి గాయాలు.. ఒకరు సీరియస్
పిట్లం, వెలుగు: మండుతున్న ఎండలకు అడవిలో నీళ్లు దొరకక జనావాసాల్లోకి వచ్చిన ఓ గుడ్డేలుగును ప్రజలు కొట్టి చంపేశారు. మద్నూర్ మండలం అవల్గాం కొండ మీద నుంచి గుడ్డేలుగు ఊళ్లోకి వచ్చింది. కనిపించిన వారిపై దాడి చేయడంతో రాజన్న, పండరీ గౌడ్, బలిరాంలు గాయపడ్డారు. ఇందులో రాజన్న తలకు బలమైన దెబ్బలు తగలడంతో ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆయనను మద్నూర్కు, అక్కడ నుంచి మహారాష్ట్రలోని దెగ్లూర్ ఆస్పత్రికి తరలించారు. రాజన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న విషయం తెలిసి గ్రామస్తులు గుడ్డేలుగును రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత దాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలిసి మద్నూర్అటవీ సెక్షన్ఆఫీసర్ అనిల్కుమార్, ఎస్సై సాజిద్అవల్గాం వచ్చి పూడ్చిపెట్టిన ఎలుగును బయటకు తీశారు. పశు వైద్యాధికారి విజయ్పరిశీలించి పోస్ట్మార్టంకోసం మద్నూర్కు తరలించారు.