గంగులను గెలిపిస్తామని ఖాజీపూర్​ గ్రామస్తుల తీర్మానం

గంగులను గెలిపిస్తామని ఖాజీపూర్​ గ్రామస్తుల తీర్మానం

కొత్తపల్లి, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్  గెలిపించుకుంటామని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామస్తులు సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా పేరున్న గంగులను నాలుగోసారి గెలిపించుకుంటామని ప్రమాణం చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్ రాజమ్మ, గ్రామస్తులు శేఖర్​రావు, శ్రీనివాస్​రెడ్డి, శంకర్​గౌడ్, రమేశ్​, తిరుపతి, అంజి గౌడ్, రాము గౌడ్, రాజశేఖర్ పాల్గొన్నారు.