ఈనెల 18న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ విడుదల

ఈనెల 18న  ‘వినరో భాగ్యము విష్ణు కథ’ విడుదల

కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశి జంటగా మురళి కిషోర్ దర్శకత్వంలో బ‌‌‌‌న్నీ వాసు నిర్మించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. శివరాత్రి సందర్భంగా ఈనెల 18న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా కశ్మీర పర్దేశి మాట్లాడుతూ ‘తెలుగులో నాకిది రెండో సినిమా. 2018లో వచ్చిన ‘నర్తనశాల’ నా ఫస్ట్ మూవీ. ఆ తర్వాత తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో నటిస్తున్నా. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మళ్లీ తెలుగులో సినిమా చేయడం హ్యాపీ. ఇందులో చాన్స్ వచ్చినప్పుడు చెన్నై బాలాజీ టెంపుల్‌‌‌‌లో ఉన్నా.

తిరుపతి బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌ సినిమా,  షూటింగ్ కూడా తిరుపతిలో అని డైరెక్టర్ చెప్పినప్పుడు శుభ శకునంగా ఫీలయ్యా. ఫస్ట్ షెడ్యూల్ 30 రోజుల పాటు తిరుపతిలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌‌‌‌లో పూర్తి చేశాం. ఇందులో నా క్యారెక్టర్ పేరు దర్శన. యాక్టింగ్‌‌‌‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్. హీరోతో పాటు ఈక్వల్‌‌‌‌ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. కిరణ్, మురళీ శర్మ గారితో షూటింగ్‌‌‌‌ని చాలా ఎంజాయ్ చేశా. అన్ని వర్గాల ప్రేక్షకులందరికి ఈ చిత్రం నచ్చుతుందనే  నమ్మకం ఉంది. ఇక నేను మరాఠి అమ్మాయినైనా తెలుగు సినిమాలు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కంటెంట్‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌ మిక్స్ చేసిన కమర్షియల్ సినిమాలు ఇక్కడ వస్తాయి. హిప్ హాప్ తమిళ హీరోగా ఓ కోలీవుడ్ సినిమా, అలాగే ఓ బాలీవుడ్‌‌‌‌ సినిమాలో నటిస్తున్నా’ అని చెప్పింది.