హైదరాబాద్: రాజ్భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి, పూలమాలలతో అందంగా అలంకరించారు. కొలువుదీరిన గణనాధునికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి వేడుకల సందర్భంగా నిర్వహించిన పూజల్లో గవర్నర్ తోపాటు రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ మాట్లాడుతూ చవితి వేడుకలు అందర్నీ ఏకం చేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.