ఇప్పటికి ఇక సెలవు.. వైరల్ అవుతోన్న విజయశాంతి ట్వీట్

ఇప్పటికి ఇక సెలవు.. వైరల్ అవుతోన్న విజయశాంతి ట్వీట్

ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి  సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టారు. అయితే  విజయ శాంతి చేసిన ట్వీట్  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు, మహేశ్ బాబుకు ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తన నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి  2020 సరిలేరు నీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవనంలో మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు కల్పిస్తోందో లేదో తెలియదన్నారు.  ఇప్పటికి ఇక శెలవని.. మనసు నిండిన మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అని ట్వీట్ చేశారు.