బిజినెస్ లోనూ రానిస్తున్న విరుష్క దంపతులు..!

బిజినెస్ లోనూ రానిస్తున్న విరుష్క దంపతులు..!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు పెట్టుబడులు పెట్టిన గో డిజిట్ కంపెనీకి సెబీ నుండి ఐపీవో లాంచ్ చేసేందుకు అప్రూవల్ లభించింది. కెనడాకు చెందిన ఫెయిర్ ఫ్యాక్స్ అనే సంస్థకు చెందిన ఈ గో డిజిట్ కంపెనీలో విరుష్క దంపతులు పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్ వంటి సేవలు అందిస్తుంది. ఆగస్టు 2022లో ఈ కంపెనీ సబ్మిట్ చేసిన ఫస్ట్ ఐపీవో ఫైల్స్ ని పరిశీలించిన సెబీ ఐపీవో లాంచ్ కి అప్రూవల్ తెలిపింది.

విరుష్క దంపతులకు కొడుకు పుట్టిన కొన్ని రోజులకే వారు పెట్టుబడులు పెట్టిన కంపెనీకి ఐపీవో అప్రూవల్ రావటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గో డిజిట్ కంపెనీతో పాటు డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్, కేఆరెన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రెఫ్రిజిరేషన్స్ వంటి కంపెనీలకు ఐపీవో అప్రూవల్ లభించింది. ఈ కంపెనీల యొక్క షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవనున్నాయి.