
టీ20 ప్రపంచకప్లో వరుస హాప్ సెంచరీలతో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తన ఆటతీరుతో విరాట్ వరల్డ్ కప్లో.. జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబర్ నెలకు గాను అతను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుకి ఎంపికయ్యాడు. అక్టోబర్ నెలలో టీ20 మ్యాచ్ల్లో కోహ్లీ 205 పరుగులు చేశాడు. ఈ అవార్డుకి కోహ్లీ నామినేట్ కావడం ఇది తొలిసారి. కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా నామినేట్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్లో వీరవిహారం చేసిన పాకిస్థాన్కు చెందిన నిదా దార్తో పాటు.. భారత మహిళల క్రికెట్ జట్టు నుంచి జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుకు ఎంపికయ్యారు. అన్ని క్రికెట్ ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. వారిని గౌరవించడం కోసం ఐసీసీ 2021 జనవరిలో ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుని మొదలుపెట్టింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుని ఇప్పటివరకు నలుగురు భారత ఆటగాళ్లు గెలిచారు.