
బ్రిటన్: ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 22 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచును కోల్పోయింది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ హాట్ కామెంట్స్ చేశాడు. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడి ఉంటే.. భారత్ సులభంగా మ్యాచ్ గెలిచేదన్నాడు.
సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాడు టెస్టుల్లో టీమిండియానే ఆధిప్యతం చెలాయించినప్పటికీ.. ఇంగ్లాండ్ రెండు మ్యాచుల్లో విజయం సాధించిందని.. ఈ లోపంపై భారత్ దృష్టి పెట్టాలని సూచించాడు. సిరీస్లో టీమిండియానే ఎక్కువ సెంచరీలు, వికెట్లు తీసింది. కానీ చివరకు మ్యాచ్ ఎలా గెలవాలనే వ్యుహాం ఇంగ్లాండ్కు బాగా తెలుసన్నారు.
ఇంగ్లాండ్ మాదిరిగా ఒక సెషన్లో ఆట గమనాన్ని మార్చే దారి భారత్ వెతకాలన్నారు. టీమిండియా తనను తాను నమ్మడం ప్రారంభించాలని సూచించాడు. నాల్గో ఇన్సింగ్స్ ఛేజింగ్లో విరాట్ కోహ్లీ లాంటి వారు సులభంగా టార్గెట్ పూర్తి చేస్తారని.. లార్డ్స్ టెస్టుల్లో కోహ్లీ ఆడి ఉంటే భారత్ సునాయసంగా విజయం సాధించేదన్నాడు స్టీవ్ హార్మిసన్.
ఇక ఐదు మ్యాచుల సిరీస్లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
2025, జూలై 23న మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లురుతున్నాయి.