చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం.. ఇస్రోను అభినందిస్తూ సెహ్వాగ్ ట్వీట్

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం.. ఇస్రోను అభినందిస్తూ సెహ్వాగ్ ట్వీట్

చంద్రుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్.. సేఫ్‌గా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఈ విజయంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది.  ఇస్రోపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. 

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమవ్వడటం పట్ల టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని భారతీయులకు అందించిన ఇస్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 

"yes.. మనం సాధించాం.. చంద్రునిపై అడుగుపెట్టాం.. ఈ చారిత్రాత్మక మిషన్‌కు తమను తాము అంకితం చేసుకున్న ఇస్రో సిబ్బందికి అందరికీ అభినందనలు.." అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.