‘విరూపాక్ష’ సినిమాతో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజే రూ. 4.79 కోట్ల షేర్ను సాధించింది. నైజాంలో రూ. 1.82 కోట్ల థియేట్రికల్ షేర్ను వసూలు చేసింది.
మొత్తంగా చూసుకుంటే విరూపాక్ష మొదటి రోజు కలెక్షన్స్ రూ.12 కోట్లుగా తెలుస్తోంది. ఓ హారర్ థ్రిల్లర్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం కూడా విశేషమే. తెలుగులో చాలాకాలం తర్వాత భిన్నమైన కథతో వచ్చిన విరూపాక్ష హిట్ టాక్ను సొంతం చేసుకుంది. వీకెండ్ కావడంతో థియేటర్లకు రష్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కార్తిక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ప్లేను అందించగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. విరూపాక్ష చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని, ఈ ఓటీటీ వేదికపైనే విరూపాక్ష ప్రదర్శించబడుతుందని థియేటర్స్ లో కన్ఫర్మ్ చేశారు మేకర్స్.
అయితే ఎన్ని వారాలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై మాత్రం ఇప్పటికి క్లారిటీ లేదు.