సుప్రిం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ . సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు కార్తిక్ దర్శకుడు. ఏప్రిల్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ను చిత్రం బృందం రిలీజ్ చేసింది.'చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది' అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కనిపిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది.
ఈ సినిమాను ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందించారు. మలయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం టీజర్ను ప్రత్యేకంగా వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సినిమాను మెచ్చుకోవడంతో ‘విరూపాక్ష’పై అంచనాలు పెరిగిపోయాయి.