త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని TDP అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. విశాఖలో నిన్న(శుక్రవారం) జరిగిన పరిణామాలపై పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నిసార్లు విశాఖకు రాకుండా అడ్డుకుంటారో చూస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న చంద్రబాబు.. YCP కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా విమానాశ్రయానికి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ నిరసనలు చేపట్టినట్లు స్పష్టమైందన్నారు.
విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.