అమరావతి, వెలుగు: బీచ్ ఫెస్ట్, లేజర్ షో, కార్నివాల్, ట్రెడిషినల్ డాన్స్ లతో అలరించిన ‘విశాఖ ఉత్సవ్’ ఆదివారంతో ముగిసింది. రెండ్రోజుల పాటు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో జరిగిన ఈ వేడుకలు దేశ, విదేశీ టూరిస్టులను ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, సినీనటుడు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ విశాఖకు తరలి రావాలని, వైజాగ్ సినీ పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖలో హైదరాబాద్ ను తలదన్నే సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. సినీ పరిశ్రమ కు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖ ఉత్సవ్ ముగింపులో భాగంగా మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి రిలీజ్ చేశారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ సంగీత విభావరి అలరించింది. ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు టూరిస్టులను ఆకట్టుకున్నాయి.
సినీ పరిశ్రమ విశాఖకు రావాలి : ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్
- ఆంధ్రప్రదేశ్
- December 30, 2019
లేటెస్ట్
- నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
- తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
- తెలంగాణలో ఇక అక్రమ దందాలు నడువయ్
- ప్రీతిస్మిత రికార్డు గోల్డ్
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..