సినీ పరిశ్రమ విశాఖకు రావాలి : ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

సినీ పరిశ్రమ విశాఖకు రావాలి : ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

అమరావతి, వెలుగు: బీచ్ ఫెస్ట్, లేజర్ షో, కార్నివాల్, ట్రెడిషినల్ డాన్స్ లతో అలరించిన ‘విశాఖ ఉత్సవ్’ ఆదివారంతో ముగిసింది. రెండ్రోజుల పాటు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో జరిగిన ఈ వేడుకలు దేశ, విదేశీ టూరిస్టులను ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, సినీనటుడు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ విశాఖకు తరలి రావాలని, వైజాగ్ సినీ పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖలో హైదరాబాద్ ను తలదన్నే సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నదే  సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. సినీ పరిశ్రమ కు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖ ఉత్సవ్‌‌ ముగింపులో భాగంగా మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి రిలీజ్ చేశారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌‌, తమన్​ సంగీత విభావరి అలరించింది. ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు టూరిస్టులను ఆకట్టుకున్నాయి.