"మార్క్ ఆంటోని" చిత్ర షూటింగ్లో గాయపడ్డ విశాల్

"మార్క్ ఆంటోని" చిత్ర షూటింగ్లో గాయపడ్డ విశాల్

హీరో విశాల్ మరోసారి గాయపడ్డాడు. మార్క్ ఆంటోనీ సినిమాలో నటిస్తున్న విశాల్..మూవీ షూటింగ్లో యాక్షన్ సీన్ చేస్తూ గాయాలపాలయ్యాడు. గురువారం తెల్లవారు జామున చెన్నైలో చిత్ర షూటింగ్ మొదలైంది. ఇందులో భాగంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లో విశాల్ నటిస్తుండగా..తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ విశాల్కు షూటింగ్ లోకేషన్లోనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.  విశాల్ను పరీక్షించిన వైద్యులు..అతనికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మార్క్ ఆంటోని షూటింగ్కు కొంతకాలం బ్రేక్ పడినట్లయింది. 

విశాల్ లాఠీ అనే సినిమాను రీసెంట్గా కంప్లీట్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్లోనూ  అతను మూడు సార్లు గాయపడ్డాడు. దాని వల్ల చిత్ర షూట్ లేట్ అవుతూ వచ్చింది. చివరకు షూటింగ్ పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో విశాల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. 

అంతకు ముందు 'ఎనిమి' చిత్ర షూటింగ్లో కూడా  విశాల్ గాయపడ్డాడు. దీంతో విశాల్కి గాయాలకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. కాబట్టి యాక్షన్ సీన్స్ విషయంలో  జాగ్రత్తలు పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.